నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 02 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానికల్ ఇంజినీరింగ్ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మిట్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి అయిన సాయి చరణ్ రెడ్డి, సీనియర్ ఇంజనీర్, ఎల్&టి టెక్నాలజీ సర్వీసెస్, బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో సాయి చరణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పరిశ్రమలో ప్రస్తుతం జరిగే తాజా పరిస్థితులు, ఆధునిక ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ సాంకేతికతల ద్వారా వచ్చే అవకాశాలు, వాటిని ప్రాక్టికల్ ప్రాజెక్టులుగా ఎలా రూపకల్పన చేస్తారు అనే అంశాలపై వివరించారు. ప్రత్యక్ష ప్రాజెక్టుల డెమోన్స్ట్రేషన్ల ద్వారా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, సమస్యల పరిష్కారం చేయడం వంటి నైపుణ్యాల పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులను భవిష్యత్ కెరీర్, పరిశోధన, మరియు స్టార్టప్ అవకాశాల కోసం ప్రేరేపిస్తూ, పరిశ్రమ-విద్యా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గేట్ పరీక్షా ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ + పీహెచీల్లో ప్రవేశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్ యూ). ఎంట్రీ లెవల్లో ఇంజనీర్ ఉద్యోగాలకు సైతం గేట్ స్కోర్ ప్రామాణికంగా నిలుస్తోంది అని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్, మేనేజర్-ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూ.విజయలక్ష్మి, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి నాగాశ్వేత, కోఆర్డినేటర్ ఎమ్.వెంకటేష్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Namitha News