నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - ఫిబ్రవరి 05 : అన్నమయ్య జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా వణుకు పుట్టిస్తున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి. ఎస్పీ ఆదేశాల మేరకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ నేరగాళ్ల ఆటకట్టిస్తున్న పోలీసులు తాజాగా, డ్రోన్ కెమెరాల నిఘాతో మదనపల్లి డియస్పి మహేంద్ర కు రాబడిన సమాచారం మేరకు బోయకొండ పరిసరాల్లో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరాన్ని పోలీసులు రట్టు చేశారు. చౌడేపల్లి మండలం బోయకొండ లోని వి.కె. రెసిడెన్సీ వెనుక భాగంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. పందెం రాయుళ్లు పోలీసుల రాకను గమనించి తప్పించుకోకుండా ఉండేందుకు, పోలీసులు తొలుత డ్రోన్ కెమెరాలను గగనతలంలోకి పంపి నిఘా పెట్టారు. పందాలు జరుగుతున్న ప్రదేశాన్ని, నిందితులను డ్రోన్ దృశ్యాల ద్వారా గుర్తించిన అనంతరం, డీఎస్పీ గారి నేతృత్వంలోని బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆకస్మిక దాడి నిర్వహించి 13 మంది జూదరులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండీ నగదు పందెం సొమ్ము 25వేల రూపాయలు నగదు, 6 పందెం కోడి పుంజులు, 13 మొబైల్ సెల్ ఫోన్లు, కోడి పందాల కోసం వాడిన 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన వేగవంతం చౌడేపల్లి ఎస్.ఐ నాగేశ్వరరావు
Admin
Namitha News