నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 24 : తంబళ్లపల్లె మండలం ఆర్ ఎన్ తాండ పంచాయతీ ఎద్దులవారి కోటకు చెందిన జనసేన నాయకుడు నరసింహులు, లక్ష్మీపతి, గ్రామస్తులు తాగునీటి సమస్య తీర్చాలని ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఆర్డబ్ల్యూఎస్ వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఏ ఈ ఈ మాట్లాడుతూ ఎద్దులవారి కోట, గుడ్లవారిపల్లి, ఎద్దులవేమన్న గారి పల్లి దళితవాడ, బోనాసివారిపల్లె లకు 50 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంకు మంజూరు అయిందని తెలిపారు. త్వరలో ట్యాంకు పనులు ప్రారంభించి పని పూర్తయితే నాలుగు గ్రామాలకు పూర్తిగా తాగు నీటి సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు
Reporter
Namitha News