Thursday, 30 July 2026 04:32:49 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పెంపుడు కూతురుపై అవాస్త ఆరోపణలు

సొంత కూతురు ఉమాదేవి చేస్తున్న అవాస్తవ ఆరోపణలు

Date : 03 June 2026 08:08 PM Views : 104

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెంపుడు కూతురుపై: కూతురు ఉమాదేవి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం: తండ్రి నాగరాజు పుంగనూరు పట్టణంలో బుధవారం మధుశ్రీ అలియాస్ హనీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుశ్రీ మాట్లాడుతూ ఉమాదేవి తనపై సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె ఖండించారు. తాంత్రిక పూజలు చేస్తున్నానని లేనిపోని వేషాలు వేస్తున్నానని అలాగే ఉమాదేవిపై తాను లైంగిక దాడికి పాల్పడ్డానని చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని మధుశ్రీ స్పష్టం చేశారు. ఉమాదేవి కుటుంబంలోని ఆస్తి వ్యవహారాల నేపథ్యంలో తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను నిజంగానే ఉమాదేవిపై లైంగిక దాడికి పాల్పడి ఉంటే డీఎన్‌ఏ పరీక్షలు సహా అవసరమైన అన్ని వైద్య పరీక్షలకు సిద్ధంగా ఉన్నానని హనీ తెలిపారు. అసత్య ప్రచారాల ద్వారా తన ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మధుశ్రీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉమాదేవి తండ్రి నాగరాజు తమ్ముడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ పెంపుడు కూతురు హనీపై ఉమాదేవి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని అన్నారు. కుటుంబ ఆస్తులకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే బహిరంగంగా ఆరోపణలు చేయకుండా నేరుగా వచ్చి తమతో చర్చించాలని ఉమాదేవికి వారు కోరారు. కుటుంబ పరమైన విషయాలను అనవసరంగా బయటకు తీసుకువచ్చి వివాదాలు సృష్టించడం సరికాదని ఉమాదేవిని వారు హెచ్చరించారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :