నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఫిబ్రవరి 23 : అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు రామసముద్రం యస్.ఐ. ఉమామహేశ్వర రెడ్డి తెలిపారు. రామసముద్రం మండల కేంద్రం లోని దిగువ హరిజనవాడ కు చెందిన సీతన్నగారి నారాయణప్ప కుమారుడు అనిల్ కుమార్ 25 సం , ఉగిని వెంకటప్ప కుమారుడు నాగరాజు 47సం అను వీరు ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం పై అక్రమ మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. బ్రాందీ 100 సాచిట్స్ , ఒరిజినల్ ఛాయిస్ 192 లను ap03p 3761 నెంబరుగల స్ప్లెన్డర్ వాహనంలో తరలిస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకుని, వారివద్ద నుండీ మద్యం స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలియచేసిన యస్.ఐ.
Admin
Namitha News