నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 27 : మదనపల్లి పట్టణం అమ్మచెర్వు మిట్ట వద్ద ఆర్.టి.ఓ. అధికారులు తనిఖీలు. అన్నమయ్య జిల్లా డి.టి.ఓ. ప్రతాప్ రావ్ ఆదేశాల మేరకు పట్టణం లో తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు రాత్రి సమయాల్లో బ్రెజర్ లైట్స్ క్రాంతి వల్ల ఎదురుగా వస్తున్న వాహనదారులకు రోడ్డు కన్పించక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఆటో లకు బ్రేజర్ లైట్స్, ప్రమాదం సమయం లో వెనుక స్టాండ్ వల్ల ఇబ్బందుల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎక్సట్రా ఫిట్టింగ్ లను తొలగిస్తూ మొదటి దఫా గా హెచ్చరించి పంపుతున్నాం, మిగిలిన వారికి కూడా తెలుపండి, బ్రేజర్ లైట్స్, నిబంధనలకు విరుద్ధంగా ఎక్సట్రా ఫిట్టింగ్స్ లను మీరే తొలగించాలని హెచ్చరిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు. ఆర్. టి. ఓ. అధికారుల చర్యలపై పలువురు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తనిఖీలలో యం.వి. ఇన్స్పెక్టర్లు దినేష్ చంద్ర, శ్రీహరి, అసిస్టెంట్ యం.వి. ఇన్స్పెక్టర్ శివలింగయ్య, ఆర్.టి.ఓ సిబ్బంది పాల్గొన్నారు
Admin
Namitha News