Sunday, 13 September 2026 07:59:19 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం

కొండల మైనింగ్ పై ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం - జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్

Date : 11 June 2026 10:19 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 11 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండల్లో శతాబ్దాల క్రితమే మహా శివుడు నెలవై నేటికీ ఈ ప్రాంత ప్రజలందరికీ పిలిస్తే పలికే ఆరాధ్య దైవంగా నిలిచాడు. ఇలాంటి లక్షలాది శివభక్తుల మనోభావాలను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ దృష్టికి తీసుకెళ్లి మైనింగ్ చర్యలను ఆపడానికి తన వంతు కృషి చేస్తానని తంబళ్లపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లయ్య కొండలపై 2000 సంవత్సరం నుండి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మృతితో మరుగున పడిందని అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి భూగర్భ గనుల శాఖ మంత్రి అరుణ కుమారి మైనింగ్ చేయడానికి ప్రయత్నించగా తంబళ్లపల్లె ప్రాంత శివ భక్తులు,ప్రజలు, పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు వ్యతిరేక లక్ష సంతకాల ఉద్యమాలు చేపట్టగా ప్రభుత్వం దిగివచ్చి ఐదు శాఖలతో విచారణ కమిటీ వేసినట్లు చెప్పారు. ఆ కమిటీ సభ్యులు సాదుకొండ, ఇనుము కొండ, మల్లయ్య కొండల్లో సుదీర్ఘంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ మల్లయ్య కొండ మహాశివుడు సాదుకొండ వీరన్న గెవి నుండి ఇనుము కొండ మీదుగా మల్లయ్య కొండల్లో స్థిరపడిన శతాబ్దాల చరిత్ర ఆనవాళ్లు ప్రత్యక్షంగా చూసి కమిటీ సభ్యులు మహాశివుని మహిమలను గుర్తించి కొండల జోలికి వెళ్లరాదని ఇచ్చిన సమగ్ర నివేదికతో కనువిప్పు కలిగి మైనింగ్ చర్యలు పై ప్రభుత్వం తప్పుకున్నట్లు చెప్పారు. నాటి నుండి నేటి వరకు తంబళ్లపల్లె నియోజకవర్గం తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన లక్షలాదిమంది మహా శివుని భక్తులు ఆయన సేవకు విరాళాలు ప్రకటించి మల్లయ్య కొండలు దినదినాభివృద్ధికి కృషి చేస్తున్నారని అలాంటి మహాన్విత కొండలను మైనింగ్ చేపడితే దైవత్వంతో పాటు పచ్చటి పర్యావరణం, లక్షలాది జీవరాసులు, వన్యప్రాణులు, ఆశ్రయం కోల్పోయి మానవ మనుగడ కష్టతరమవుతుందని మల్లయ్య కొండల్లో మైనింగ్ పై ఈ ప్రాంత చిన్న పిల్లవాడిని కదిలించిన తీవ్ర వ్యతిరేకత వస్తుందని లక్షలాది భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవునిపై రాజకీయాలు చేయకుండా మల్లయ్య కొండ శివుడు మన అందరి ఆరాధ్య దైవంగా మల్లయ్య కొండల్లో మైనింగ్ సమస్య పరిష్కారానికి శివ భక్తులు, ప్రజల మనోభావాలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పార్టీలకతీతంగా అందరి సహకారంతో తన వంతు కృషి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :