నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 18 : తంబళ్లపల్లె మండలంలోని విద్యార్థులు సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యతోపాటు సైన్స్ లో నైపుణ్యం సంపాదించి భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదగాలని ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు లు ప్రోత్సహించారు. గురువారం జడ్పీ హైస్కూల్లో 10 పాఠశాలలకు చెందిన విద్యార్థుల సైన్స్ ఫెయిర్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రకృతి వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, హెల్త్ మరియు బయో సైన్స్, ప్రయోగాలలో ఉత్తమమైన కంపోస్ట్ స్పిన్క్లర్ మిషన్, నర్సరీ సప్లయింగ్ ప్రొటెక్టర్, స్మార్ట్ స్పెక్టికల్స్ ఫార్ బ్లైండ్, మోడల్ ఆన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ, కన్వర్షన్ ఆఫ్ రైన్ వాటర్ ప్రయోగాలు మోడల్ స్కూల్ కు చెందిన మహమ్మద్ యునస్, తంబళ్లపల్లె జడ్పీ హైస్కూల్ కు చెందిన రాకేష్, మధుప్రియ, కన్నెమడుగు హైస్కూల్ కు చెందిన దిలీప్ కుమార్, చేతన్ రెడ్డి లు ఎంపికయ్యారు. వీరు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో పాటు వారిని గైడ్ చేసిన అధ్యాపకులు వైష్ణవి, దేవి హేమలత, రేవతి, నారాయణమూర్తి లనుప్రశంసించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్జిలుగా జూనియర్ కాలేజ్ అధ్యాపకులు, స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, హెడ్మాస్టర్ శ్రీనివాసులు, పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News