Sunday, 13 September 2026 07:11:48 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ

వీరి జీవిత భాగస్వాముల త్యాగం వెలకట్టలేనిదన్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 30 May 2026 06:34 PM Views : 151

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 30: సమాజ రక్షణ కోసం దశాబ్దాల కాలం పాటు అంకితభావంతో పనిచేసి, ప్రజలకు సేవలందించిన పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి కొనియాడారు. శనివారం స్థానిక పోలీసు సమావేశ మందిరంలో మే నెలలో పదవీ విరమణ పొందిన ముగ్గురు ఏఎస్ఐలకు జిల్లా పోలీసు యంత్రాంగం తరపున ‘ఆత్మీయ వీడ్కోలు’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఒక పోలీసు అధికారి సుదీర్ఘ సర్వీసు పూర్తి చేయడంలో వారి జీవిత భాగస్వామి పాత్ర, భాగస్వామ్యం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. నాటి రోజుల్లో నేటి వలె అత్యాధునిక వసతులు లేకపోయినా, రకరకాల ఇబ్బందులను తట్టుకుని, కుటుంబానికి దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించడంలో సతీమణులు అందించిన సహకారం, చేసిన త్యాగాలు వెలకట్టలేనివని వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇన్ని రోజులు విధి నిర్వహణకే అంకితమై సమయాన్ని, శక్తిని వినియోగించారని, ఇకపై శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి సంతోషంతో, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు

పదవీ విరమణ పొందిన వారిలో కలికిరి పీఎస్ ఏఎస్ఐ ఎస్. మాబూ సాహెబ్ (35 ఏళ్ల సర్వీస్), రామాపురం పీఎస్ ఏఎస్ఐ పి. వెంకటరమణ (35 ఏళ్ల సర్వీస్), మరియు రైల్వేకోడూరు పీఎస్ ఏఎస్ఐ ఎం. శేఖర్ రావు (33 ఏళ్ల సర్వీస్) ఉన్నారు. వీరికి ఎస్పీ గారు జ్ఞాపికలను అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. దశాబ్దాలుగా మమేకమైన పోలీసు శాఖను, తోటి సిబ్బందిని వదిలి వెళ్తుండటంతో అటు సంతోషం, ఇటు దుఃఖం కలగలిసిన భావోద్వేగాల నడుమ రిటైర్డ్ అధికారులు కన్నీరు కార్చారు. తమను ఇంత గౌరవంగా సత్కరించడం జీవితంలో మరువలేమంటూ ఎస్పీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పోలీసు శాఖ ఎప్పుడూ ఒకే కుటుంబమని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని, ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించవచ్చని ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారు, ఏఏఓ పి. శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ఎం. రవికుమార్, కె. సురేష్ కుమార్ రెడ్డి, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.చంద్రశేఖర్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది మరియు పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :