నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 06 : ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగుల ద్వారా విద్యార్థులు స్ఫూర్తి పొంది తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. శనివారం ఆయన మోడల్ స్కూల్లో విద్యార్థులతో పేరేంట్స్, టీచర్స్ మీటింగ్ ద్వారా విద్యార్థుల విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, అధ్యాపకుల బోధన సామర్ధ్యం పై చర్చించుకునే అవకాశం ఉంటుందని తద్వారా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. విద్యార్థులు రాబోయే టెన్త్ క్లాస్ పరీక్షల్లో అధ్యాపకుల శిక్షణలో ప్రతిభ కనబరిచి సత్ఫలితాలు సాధించాలన్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలన్నారు. ఆయన వెంట ఎంఈఓ త్యాగరాజు, ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News