నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 29 : తంబళ్లపల్లి మండలంలోని గోపి దిన్ని లో టిడిపి ఆవిర్భావ దినోత్సవం స్థానిక టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం టిడిపి పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం 1982 లో టిడిపిని స్థాపించగా ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని దేశంలోనే ఎక్కడా లేని విధంగా కోటి సభ్యత్వాలు గల పార్టీగా తీర్చిదిద్ది ఖ్యాతి గడించినట్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసిధర్ నాయుడు, రాజంపేట బిసి కార్యవర్గ సభ్యుడు సోమశేఖర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు అశోక్, చిన్న రెడ్డి,చెరువు సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి, సీనియర్ నాయకులు శివరాం, కేశవరెడ్డి, వార్డ్ మెంబర్ జగదీష్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News