నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 14 : తంబళ్లపల్లె మండలం మర్రి మాకులపల్లి పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన దండు మారెమ్మ ఆలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. సోమవారం మండల పూజలో భాగంగా దండు మారెమ్మ అమ్మవారికి ప్రధాన అర్చకుల సారథ్యంలో చండీయాగం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీలోని ప్రజలు, మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు , అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి అనంతరం దీలు బాణాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయం విద్యుత్ దీపాలంకరణ, బాణ సంచా, ప్రత్యేక వాయిద్య బృందాలు, భజనలు , కోలాటాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు
Reporter
Namitha News