నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 27 : నారా లోకేష్ యువగళం పాదయాత్ర, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైనా తొలినాళ్ల నుండీ జిల్లాల పునరవిభజన కు కార్యరూపం దాల్చి నేడు మదనపల్లి జిల్లా ఏర్పాటు, జిల్లా కేంద్రం మదనపల్లి గా ప్రిలిమినరీ గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా ఏర్పాటు కు ఎనలేని కృషి చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష విజయవాడ నుండీ మదనపల్లి కి వస్తున్న తరుణం లో మదనపల్లి నియోజకవర్గం మొదలయ్యే కాశీరావు పేట వద్ద భారీ వాహన శ్రేణి తో స్వాగతం పలికిన కూటమి నాయకులు. పట్టణం కు ర్యాలీ గా వస్తున్న ఎమ్మెల్యే ను గ్రామ గ్రామాన మహిళలు ఎమ్మెల్యేని స్వాగతిస్తూ జిల్లా చేసిన సి.యం. చంద్రబాబు, డిప్యూటీ సి.యం. పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మహిళలు. పట్టణం లో భారీ వాహన శ్రేణులతో పురవీధుల్లో సి.యం. చంద్రబాబు ను కొనియాడుతూ, జెజే పలుకుతూ ధన్యవాదములు తెలియచేసిన మదనపల్లి పుర ప్రజలు
Admin
Namitha News