నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 06 : మదనపల్లె లో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధమైన కేసులో ప్రధాన ముద్దాయైన మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారుల సోదాలు మదనపల్లి జిల్లాలోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పైళ్ల దగ్ధం కేసులో ప్రధాన నిందితుడు రైస్ మిల్ మాధవ రెడ్డి ఇంట్లో సీఐడి అధికారులు సోదాలు చేపట్టారు. శనివారం వేకువ జాము నుండే అధికారులు మాధవ రెడ్డి ఇంట్లో అణు వణువును సోదాలు చేస్తున్నారు. అయితే మాధవ రెడ్డి మాత్రం అందుబాటులో లేడని సమాచారం. తిరుపతి నుండి వచ్చిన సీఐడి డిఎస్పి వేణు గోపాల్, సీఐలు రాజ కుమార్, రంగస్వామి, మదనపల్లి వన్ టౌన్ ఎస్సైలు శివకుమార్, అన్సర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News