నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 22 : తంబళ్లపల్లె మండలంలోని మారుమూల గ్రామాలలో క్లీన్ అండ్ గ్రీన్ పై మహిళా సంఘాలు అవగాహన కల్పించి కీలకపాత్ర పోషించాలని డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని ఐకెపి మండల సమైక్య సభ్యులు, సచివాలయ సిబ్బంది కి క్లీన్ అండ్ గ్రీన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో పారిశుద్ధ్యం తోబాటు చెత్త సేకరణ అందులో తడి పొడి చెత్త వేరుచేసి ఎరువు తయారీపై సూచనలు చేశారు. డంపింగ్ యార్డ్ కు గ్రీన్ అంబాసిడర్లు చెత్త తరలింపుకు ప్రజలు సహకరించేలా అవగాహన పెంచాలన్నారు. దీంతోపాటు విరివిగా మొక్కలు పెంపకంతో పచ్చదనం, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, మండలంలోని ఐకెపి మండల సమైక్య సభ్యులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News