నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రూ.14 లక్షలతో తాగునీటి సౌకర్యం.. దుబ్బిగానిపల్లిలో బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా : రాయలసీమలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మదనపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా తెలిపారు. మంగళవారం మదనపల్లి గ్రామీణ మండలం దుబ్బిగానిపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లి గ్రామంలో రూ.14 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి బోరు, మోటారు, పైపులైన్ పనులను ప్రారంభించి ప్రజలకు తాగునీటిని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చోట బోర్లు, పైపులైన్లు ఏర్పాటు చేస్తూ ప్రజలకు నిరంతర మంచినీటి సరఫరా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తాగునీటి సౌకర్యాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చల్లా నరసింహులు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్సార్ షంషేర్, రాజగోపాల్, కృష్ణమూర్తి, శ్రీనివాసులు ఒంటిమిట్ట, ప్రసాద్ నాయుడు, నవీన్ చౌదరి, జేసీబీ వేణు, జైచంద్ర, ఎంపీడీవో తాజ్మస్రూర్, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News