Sunday, 13 September 2026 11:05:31 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

నమోదు లేని ఆసుపత్రులు, ల్యాబ్‌లపై కఠిన చర్యలు

Date : 14 May 2026 04:42 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమోదు లేని ఆసుపత్రులు, ల్యాబ్‌లపై కఠిన చర్యలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం : డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని అన్నమయ్య జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య తెలిపారు. జిల్లాలో నిర్వహణలో ఉన్న ప్రతి ఆసుపత్రి, క్లినిక్, ల్యాబొరేటరీ తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖలో నమోదు కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. నమోదు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు లేదా ల్యాబ్‌లు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తిస్తే సంబంధిత వైద్య చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించిన పాజిటివ్ కేసులను వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు తెలియజేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లకు సూచించారు. వ్యాధుల నియంత్రణ, నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సమాచారం ఎంతో కీలకమని తెలిపారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు, అవసరమైన మందులు, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని డాక్టర్ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :