Thursday, 30 July 2026 03:55:42 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి

Date : 08 July 2026 04:09 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా విశాలాంధ్ర, మదనపల్లి: మదనపల్లె పట్టణంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏర్పడిన తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్, అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, పట్టణంలోని అన్ని కాలనీలకు అవసరమైన మేర నీటిని సమీప జలవనరుల నుంచి ట్రాక్టర్లు, ట్యాంకర్ల ద్వారా తరలించి ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా సీటీఎం రోడ్డు విస్తరణ పనులపై కూడా ఎమ్మెల్యే సమీక్షించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన డ్రైనేజీ కాలువను సర్వే చేసి, అవసరమైన సాంకేతిక చర్యలు పూర్తి చేసిన అనంతరం రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా సంబంధిత బీఎల్‌ఓలకు అవసరమైన సూచనలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో డీఈ శ్రావణి, ఏఈలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :