నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ - హాజరైన ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.రవీంద్రనాథ్ రెడ్డి మదనపల్లె : పట్టణంలోని చారిత్రాత్మక బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు.ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.రవీంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు డాక్టర్ గుత్తా గిరిబాబు చేతుల మీదుగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమైంది.ఆ తర్వాత కళాశాల ఉపాధ్యక్షులు డాక్టర్ జి.శ్రీదేవి చేతుల మీదుగా మరికొన్ని మొక్కలు నాటి నీరు పోశారు.కార్యక్రమంలో భాగంగా రావి,మర్రి,వేప,కానుగ మరియు ఇతర మొక్కలు నాటారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ మలిగి రాఘవరెడ్డి,డాక్టర్ శైలజ సి.ఎస్,డాక్టర్ శ్రీనివాస్ డేరంగ్,డాక్టర్ జి.చిన్నారెడ్డి,ఎల్.బి.ప్రదీప్,టి.బాలాజీ,డాక్టర్ కృష్ణవేణి,డాక్టర్ ఎస్.గురుప్రసాద్,మాధవి ఇతర అధ్యాపకులు,బోధనేతర సిబ్బంది,పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News