Thursday, 16 April 2026 03:21:31 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మిట్స్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ అండ్ ఏ ఐ సెక్యూరిటీ కార్యక్రమం

Date : 09 March 2026 06:01 PM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 09 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం వారు ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ మరియు మిట్స్ ఐఈఈఈ సహకారంతో రెండు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ అండ్ ఏ ఐ సెక్యూరిటీ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చెన్నైలోని ఆర్ ఏం కే ఇంజనీరింగ్ అటానమస్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి పాల్ రాజ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిధి డాక్టర్ డి పాల్ రాజ్ మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ డి పాల్ రాజ్ మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్‌ సెక్యురిటీ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత యంత్రాలు, అల్గోరిథములు, మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ మోడళ్ళ ద్వారా సైబర్‌ దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకునే రక్షణ కవచంగా పనిచేస్తాయని అన్నారు నెట్‌వర్క్‌లలో అనుమానాస్పద మరియు అసాధారణ ప్రవర్తనను గుర్తించడం, డేటా భద్రతను మెరుగుపరచడం, మోసపూరిత లావాదేవీలను నిరోధించడం, మాల్వేర్ దాడులను అడ్డుకోవడంలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ముఖ్య పాత్ర పోషిస్తోంది అని అన్నారు. అయితే ఇదే సాంకేతికతను సైబర్ నేరగాళ్లు కూడా ఆధునిక దాడుల కోసం వినియోగిస్తున్నారని. ఏ.ఐ ఆధారిత ఫిషింగ్ సందేశాలు, డీప్‌ఫేక్ వీడియోలు, ఆటోమేటిక్‌గా మార్పులు చెందే మాల్వేర్, సైబర్ దాడులు భద్రతా వ్యవస్థలకు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయని అన్నారు . అందువల్ల AI ఆధారిత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు మరియు సైబర్‌ చట్టాలను మరింత కఠినతరం చేయడం అత్యవసరమని సూచించారు. రాబోయే డిజిటల్‌ భవిష్యత్తులో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ బాధ్యతాయుత వినియోగం ప్రపంచ సైబర్ భద్రతను నిర్ణయించాల్సి ఉంటుంది అని అన్నారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా యువ పరిశోధకులకు నూతన ఆలోచనలు, పరిశోధన అవకాశాలు మరియు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు పరిశ్రమ నిపుణులు ఒకే వేదికపై కలుసుకుని తమ తాజా పరిశోధనలను పంచుకోవడం, సైబర్ ముప్పుల గురించి అవగాహన పెంచుకోవడం మరియు ఏ.ఐ ఆధారిత భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు అని అన్నారు. దేశ విదేశాల నుంచి 170 మంది పరిశోధకులు మరియు విద్యార్థులు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొని తమ పరిశోధన పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. ఈ సదస్సులో భోపాల్ లోని ఎన్ ఐ టి టి టి ఆర్ (NITTTR) విద్య సంస్థ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గణపతి మరియు ఒమన్ దేశం, మస్కట్ లోని యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ గుణశేఖరన్ తంగవేల్ లు వర్చ్యువల్ పద్దతిలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ బి.పెర్సిస్ అర్బన, కన్వీనర్ డాక్టర్ కే.పి మణికంధన్, కోఆర్డినేటర్స్ టి నిరంజన్, ఎమ్.ముత్తురాసు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :