నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 16 : మదనపల్లి మండలం వలసపల్లి మరియు పోతబోలు పంచాయతీ లలో నవోదయ కాలనీ, మొలకలదిన్నె కాలనీ , సిద్ధమ్మ గారి పల్లి హరిజనవాడ -1 హరిజనవాడ -2 నందు దాదాపు 60 లక్షల రూపాయలతో నూతనంగా మంజూరైన సి.సి రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే. భూమి పూజ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో రెండు కోట్ల రూపాయల నిధులతో వలసపల్లి గ్రామ పంచాయతీని రోడ్లు నిర్మాణంకు, కాలువల నిర్మాణం కు నిధులు మంజూరు చేపిస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Admin
Namitha News