నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 03 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధర-జల హారతి కార్యక్రమం విజయవంతనికి జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఇచ్చిన ఆదేశాలతో తంబళ్లపల్లె మండలంలో జలధార కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు పాల్గొని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గత శనివారం జిల్లా పిడి కోసువారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలధార పనులను పరిశీలించి సంతృప్తి చెంది ఇదే ఊపు కొనసాగించాలని ప్రోత్సహించారు. మండలంలో జలధార కార్యక్రమం విజయవంతానికి ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్ తో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు తమ వంతు బాధ్యతగా గ్రామాల్లో జలధార కార్యక్రమం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మండలంలోని గుండ్లపల్లి, గోపి దిన్నె, ఆర్ ఎన్ తాండా, కోటకొండ, కుక్క రాజు పల్లి, రేణుమాకులపల్లి, పంచాయతీలలో సైతం పెద్ద ఎత్తున కూలీలు హాజరై జలధార కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీల పరిధిలోని చిన్నేరు వాగు తో పాటు పలు చెరువుల అనుసంధాన కాలువల పనులు, పెద్దేరు ప్రాజెక్టు కాలువల మరమ్మతులు, పార్ జంగిల్ క్లీనింగ్,కు యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేసి పనులు చేపట్టాలని స్థానిక చెరువు సంఘం అధ్యక్షులు, రైతులు, ప్రజలు కోరుతున్నారు
Reporter
Namitha News