నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు -:ఏప్రిల్ 10 : పుంగనూరు కొత్తయిండ్లు కు చెందిన స్వర్గీయ ప్రభాకర్ పాల్ కుమారుడు ఆర్.శ్రీరాజ్ కుమార్ కు డిపార్ట్మెంట్ అఫ్ నోయిడ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా పబ్లిక్ హెల్త్ విభాగం లో పి.హెచ్.డి. ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ఢిల్లీ నోయిడా ఇంటర్ నేషనల్ యూనివర్శిటి నందు అందుకొన్నారు.తను డిపార్ట్మెంట్ అఫ్ పబ్లిక్ హెల్త్ పై పి హెచ్ డి పై రీసర్చ్ చేసినట్లు శ్రీరాజ్ కుమార్ తెలిపారు. సాధారణ మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన శ్రీరాజ్ పుంగనూరు కొత్తయిండ్లు మున్సిపల్ స్కూల్ నందు పదవ తరగతి వరకు విద్యాబ్యాసం, బసవరాజ జూనియర్ కళాశాల నందు ఇంటర్ బై పిసి కొనసాగింది. పట్టుదలతో ఉద్యోగం చేస్తూనే డిపార్ట్మెంట్ అఫ్ పబ్లిక్ హెల్త్ సైన్స్ పై రెండు డిగ్రీ లు పూర్తి చేసి అనంతరం గ్రేటర్ నోయిడా నందు డిపార్ట్మెంట్ అఫ్ నోయిడ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారి సూచనలతో ఐదేళ్ళు పి హెచ్ డి పబ్లిక్ హెల్త్ పై పరిశోదనను పూర్తి చేసినట్లు అయన తెలిపారు.గత ఇరవై సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా శారదా విశ్వ విద్యాలయం లో నర్సింగ్ విభాగం లో డీఏమ్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఉన్నత విద్యాలలో ప్రతిభ కనపరచిన శ్రీరాజ్ కుమార్ నకు పుంగనూరు తన బంధువులు ఆత్రల్ పాల్, అనిల్ కుమార్, సి ఎస్ ఐ చర్చి వారు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్త పరిచారు
Reporter
Namitha News