Thursday, 30 July 2026 06:49:45 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నోయిడ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండీ డాక్టరేట్ పొందిన పుంగనూరు వాసి శ్రీరాజ్ కుమార్

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా పి.హెచ్.డి. పట్టా అందుకున్న శ్రీరాజ్ కుమార్

Date : 10 April 2026 03:01 PM Views : 143

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు -:ఏప్రిల్ 10 : పుంగనూరు కొత్తయిండ్లు కు చెందిన స్వర్గీయ ప్రభాకర్ పాల్ కుమారుడు ఆర్.శ్రీరాజ్ కుమార్ కు డిపార్ట్మెంట్ అఫ్ నోయిడ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా పబ్లిక్ హెల్త్ విభాగం లో పి.హెచ్.డి. ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ఢిల్లీ నోయిడా ఇంటర్ నేషనల్ యూనివర్శిటి నందు అందుకొన్నారు.తను డిపార్ట్మెంట్ అఫ్ పబ్లిక్ హెల్త్ పై పి హెచ్ డి పై రీసర్చ్ చేసినట్లు శ్రీరాజ్ కుమార్ తెలిపారు. సాధారణ మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన శ్రీరాజ్ పుంగనూరు కొత్తయిండ్లు మున్సిపల్ స్కూల్ నందు పదవ తరగతి వరకు విద్యాబ్యాసం, బసవరాజ జూనియర్ కళాశాల నందు ఇంటర్ బై పిసి కొనసాగింది. పట్టుదలతో ఉద్యోగం చేస్తూనే డిపార్ట్మెంట్ అఫ్ పబ్లిక్ హెల్త్ సైన్స్ పై రెండు డిగ్రీ లు పూర్తి చేసి అనంతరం గ్రేటర్ నోయిడా నందు డిపార్ట్మెంట్ అఫ్ నోయిడ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారి సూచనలతో ఐదేళ్ళు పి హెచ్ డి పబ్లిక్ హెల్త్ పై పరిశోదనను పూర్తి చేసినట్లు అయన తెలిపారు.గత ఇరవై సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా శారదా విశ్వ విద్యాలయం లో నర్సింగ్ విభాగం లో డీఏమ్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఉన్నత విద్యాలలో ప్రతిభ కనపరచిన శ్రీరాజ్ కుమార్ నకు పుంగనూరు తన బంధువులు ఆత్రల్ పాల్, అనిల్ కుమార్, సి ఎస్ ఐ చర్చి వారు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్త పరిచారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :