Tuesday, 14 April 2026 05:27:46 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

మిట్స్ విద్యార్థులకు డిజిటల్ యుగంలో వ్యక్తిగత బ్రాండింగ్, లింక్డ్‌ఇన్ బ్లూప్రింట్ పై అవగాహనా కార్యక్రమం

Date : 10 April 2026 07:40 PM Views : 54

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 10 : మదనపల్లి సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో “డిజిటల్ యుగంలో వ్యక్తిగత బ్రాండింగ్: లింక్డ్‌ఇన్ బ్లూప్రింట్” అనే అంశంపై విద్యార్థులకు అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఐ.టి సంస్థ అయిన లింక్డ్ఇన్ (Linkedin), రీజినల్ హెడ్ (సౌత్ & ఈస్ట్), కృష్ణ రెడ్డి చింత పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లింక్డ్ఇన్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంతో ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ అభివృద్ధికి సహాయపడే సాధనంగా మారిందని అన్నారు. ఇది కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాకుండా, ప్రొఫెషనల్ ప్రపంచానికి గేట్‌వేలా పనిచేస్తుంది అని అన్నారు. విద్యార్థులు తమ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్, సర్టిఫికేషన్స్‌ను వ్యక్తిగత వివరాలలో చూపిస్తూ ఒక బలమైన డిజిటల్ రెజ్యూమ్‌ను తయారు చేసుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, అల్యూమిని, రిక్రూటర్స్‌తో కనెక్ట్ అవుతూ మంచి నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చని అన్నారు. లింక్డ్ఇన్ ద్వారా కంపెనీలు ఉద్యోగాలు మరియు ఇంటర్న్‌షిప్స్‌ను నేరుగా పోస్ట్ చేస్తాయి, వాటికి విద్యార్థులు సులభంగా అప్లై చేసుకోవచ్చని అన్నారు. అదనంగా లింక్డ్ఇన్ లెర్నింగ్ వంటి ఫీచర్ల ద్వారా కొత్త టెక్నాలజీలు మరియు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. పోస్ట్స్, ఆర్టికల్స్, ప్రాజెక్ట్స్ షేర్ చేయడం ద్వారా వ్యక్తిగత బ్రాండింగ్‌ను మెరుగుపరుచుకోవచ్చు, ఇది రిక్రూటర్స్ దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు. అలాగే ఇండస్ట్రీ ట్రెండ్స్, కంపెనీల అప్డేట్స్ తెలుసుకోవడం ద్వారా కెరీర్ ప్లానింగ్‌కు ఉపయోగపడుతుంది. ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ నందు ఏడు కోట్ల సంస్థలు నమోదు చేసుకుని ఉన్నాయని అన్నారు. మొత్తంగా, లింక్డ్ ఇన్ ఫ్లాట్ ఫామ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రొఫెషనల్ గ్రోత్, నెట్‌వర్కింగ్ మరియు ఉద్యోగ అవకాశాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, అసోసియేట్ డీన్-ట్రైనింగ్ & స్కిల్ డెవలప్మెంట్ డాక్టర్ వి.జయ ప్రకాషన్, సీనియర్ మేనేజర్-స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ పి.అథాహర్ సమీనా, కోఆర్డినేటర్స్ జె.టి ద్రుపద్ వర్మ, షైక్ టిప్పు రెహమాన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :