Wednesday, 29 July 2026 11:05:50 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ విద్యార్థులకు డిజిటల్ యుగంలో వ్యక్తిగత బ్రాండింగ్, లింక్డ్‌ఇన్ బ్లూప్రింట్ పై అవగాహనా కార్యక్రమం

Date : 10 April 2026 07:40 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 10 : మదనపల్లి సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో “డిజిటల్ యుగంలో వ్యక్తిగత బ్రాండింగ్: లింక్డ్‌ఇన్ బ్లూప్రింట్” అనే అంశంపై విద్యార్థులకు అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఐ.టి సంస్థ అయిన లింక్డ్ఇన్ (Linkedin), రీజినల్ హెడ్ (సౌత్ & ఈస్ట్), కృష్ణ రెడ్డి చింత పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లింక్డ్ఇన్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంతో ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ అభివృద్ధికి సహాయపడే సాధనంగా మారిందని అన్నారు. ఇది కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాకుండా, ప్రొఫెషనల్ ప్రపంచానికి గేట్‌వేలా పనిచేస్తుంది అని అన్నారు. విద్యార్థులు తమ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్, సర్టిఫికేషన్స్‌ను వ్యక్తిగత వివరాలలో చూపిస్తూ ఒక బలమైన డిజిటల్ రెజ్యూమ్‌ను తయారు చేసుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, అల్యూమిని, రిక్రూటర్స్‌తో కనెక్ట్ అవుతూ మంచి నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చని అన్నారు. లింక్డ్ఇన్ ద్వారా కంపెనీలు ఉద్యోగాలు మరియు ఇంటర్న్‌షిప్స్‌ను నేరుగా పోస్ట్ చేస్తాయి, వాటికి విద్యార్థులు సులభంగా అప్లై చేసుకోవచ్చని అన్నారు. అదనంగా లింక్డ్ఇన్ లెర్నింగ్ వంటి ఫీచర్ల ద్వారా కొత్త టెక్నాలజీలు మరియు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. పోస్ట్స్, ఆర్టికల్స్, ప్రాజెక్ట్స్ షేర్ చేయడం ద్వారా వ్యక్తిగత బ్రాండింగ్‌ను మెరుగుపరుచుకోవచ్చు, ఇది రిక్రూటర్స్ దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు. అలాగే ఇండస్ట్రీ ట్రెండ్స్, కంపెనీల అప్డేట్స్ తెలుసుకోవడం ద్వారా కెరీర్ ప్లానింగ్‌కు ఉపయోగపడుతుంది. ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ నందు ఏడు కోట్ల సంస్థలు నమోదు చేసుకుని ఉన్నాయని అన్నారు. మొత్తంగా, లింక్డ్ ఇన్ ఫ్లాట్ ఫామ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రొఫెషనల్ గ్రోత్, నెట్‌వర్కింగ్ మరియు ఉద్యోగ అవకాశాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, అసోసియేట్ డీన్-ట్రైనింగ్ & స్కిల్ డెవలప్మెంట్ డాక్టర్ వి.జయ ప్రకాషన్, సీనియర్ మేనేజర్-స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ పి.అథాహర్ సమీనా, కోఆర్డినేటర్స్ జె.టి ద్రుపద్ వర్మ, షైక్ టిప్పు రెహమాన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: