నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 08 : తంబళ్లపల్లె మండలంలో జలధారలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రైతులు ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సహకరించాలని ఉపాధి హామీ అధికారులు సూచిస్తున్నారు. బుధవారం ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏ పీ ఓ అంజనప్ప ఆదేశాలతో ఉపాధి హామీ అధికారులు కుక్కరాజు పల్లి, కోటకొండ పంచాయతీలో జలధార పనుల ఎంపిక కార్యక్రమం ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ అధికారులు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చెక్ డ్యాములను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలభద్రత కార్యక్రమంలో నీటి సంరక్షణ పనులతో పాటు జంగిల్ క్లీనింగ్, కాలువలు మరమ్మతులు, చెరువుల కట్టలు, మొరవలు పట్టిష్టం తదితర పనులను పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఈసీ మహేష్, టి ఏ లు బాలగంగాధర్, సుజాత, భూదేవి ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు, కూలీలు పాల్గొన్నారు.
Reporter
Namitha News