Saturday, 12 September 2026 07:19:14 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచాలి - డి.ఈ. గంగాధరం

Date : 20 June 2026 09:10 PM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 20 : ప్రధాని సూర్యఘర్ సోలార్ విద్యుత్ వినియోగం తద్వారా వారికి లభించే లబ్ధిపై ప్రజల్లో అవగాహన పెంచాలని విద్యుత్ శాఖ డి ఈ గంగాధరం సూచించారు. శనివారం ఆయన మండలంలోని కుక్కరాజుపల్లి, కోటకొండ, రేణుమాకులపల్లె లో ఎస్సీలకు ఉచితంగా ఏర్పాటుచేసిన రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. భవిష్యత్తులో సోలార్ విద్యుత్తు ద్వారా బిల్లులు చెల్లించే పని లేకుండా లబ్ధిదారునికేఆదాయ లబ్ధి చేకూరే విషయాన్ని విస్తృత పరచాలన్నారు. అనంతరం పలు విద్యుత్ సబ్ స్టేషన్ లను తనిఖీ చేసి విద్యుత్ సరఫరా వేళలు, సిబ్బంది పనితీరు పై ఆరా తీశారు. వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా ట్రీ కటింగ్ చేపట్టి రైతులకు 9 గంటలకు విద్యుత్తు అందించాలన్నారు. పొలాల వద్ద వన్యప్రాణుల కోసం విద్యుత్ సరఫరా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విద్యుత్ సిబ్బంది బిల్లుల వసూళ్లపై దృష్టి సారించి వినియోగదారుల విద్యుత్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరించాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏడి గోవిందరెడ్డి, ఏఈ సురేంద్ర, లైన్ ఇన్స్పెక్టర్ లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్ శంకర్, ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :