Wednesday, 29 July 2026 05:19:40 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచాలి - డి.ఈ. గంగాధరం

Date : 20 June 2026 09:10 PM Views : 80

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 20 : ప్రధాని సూర్యఘర్ సోలార్ విద్యుత్ వినియోగం తద్వారా వారికి లభించే లబ్ధిపై ప్రజల్లో అవగాహన పెంచాలని విద్యుత్ శాఖ డి ఈ గంగాధరం సూచించారు. శనివారం ఆయన మండలంలోని కుక్కరాజుపల్లి, కోటకొండ, రేణుమాకులపల్లె లో ఎస్సీలకు ఉచితంగా ఏర్పాటుచేసిన రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. భవిష్యత్తులో సోలార్ విద్యుత్తు ద్వారా బిల్లులు చెల్లించే పని లేకుండా లబ్ధిదారునికేఆదాయ లబ్ధి చేకూరే విషయాన్ని విస్తృత పరచాలన్నారు. అనంతరం పలు విద్యుత్ సబ్ స్టేషన్ లను తనిఖీ చేసి విద్యుత్ సరఫరా వేళలు, సిబ్బంది పనితీరు పై ఆరా తీశారు. వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా ట్రీ కటింగ్ చేపట్టి రైతులకు 9 గంటలకు విద్యుత్తు అందించాలన్నారు. పొలాల వద్ద వన్యప్రాణుల కోసం విద్యుత్ సరఫరా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విద్యుత్ సిబ్బంది బిల్లుల వసూళ్లపై దృష్టి సారించి వినియోగదారుల విద్యుత్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరించాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏడి గోవిందరెడ్డి, ఏఈ సురేంద్ర, లైన్ ఇన్స్పెక్టర్ లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్ శంకర్, ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :