నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రం శివప్రసాద్ మృతి టీడీపీ కి తీరని లోటు యువతకి ఆదర్శ నాయకుడు దూరమయ్యారన్న శ్రీరామ్ చినబాబు ఘననివాళులు అర్పించిన రాష్ట్ర అధ్యక్షులు (తెలుగుయువత) పీలేరు : నియోజకవర్గంలోని కలకడ మండలంలోని నావాబుపేటకు చెందిన టీడీపీ వీర సైనికుడు, మాజీ సర్పంచ్, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహాక కార్యదర్శి గుర్రం శివప్రసాద్ అకాల మరణం టీడీపీ పార్టీకి మరియు యువతకి తీరని లోటని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆవేదన వ్యక్తం చేశారు.వైసీపీ నాయకుల అక్రమ కేసుల్లో జైల్లో ఉండి కూడా గ్రామంలో టీడీపీ జెండా ఎగరేసిన ఏకైక కార్యకర్త అని కొనియాడారు.నేడు నావాబు పేట గ్రామంలో ఆయన బౌతిక కాయానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.శివప్రసాద్ కుటుంబానికి టీడీపీ పార్టీ ఎప్పటికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, కొత్తపేట శ్యామ్, రూపేష్, ప్రవీణ్,నేషనల్ మీడియా జర్నలిస్ట్ S.N. మీడియా అధినేత శ్యామ్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News