నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 20 : పుంగనూరు పరిధిలోని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ రంజిత తెలిపారు. ఈ కార్యక్రమం కింద పుంగనూరు పరిధిలో సుమారు 13 వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆమె వెల్లడించారు.అర్బన్ ప్రాంతాల్లో 6,402 మంది, రూరల్ ప్రాంతాల్లో 62,950 మంది పిల్లలను గుర్తించినట్లు చెప్పారు. పిల్లలకు సులభంగా పోలియో చుక్కలు అందించేందుకు మొత్తం 57 పోలియో కేంద్రాలతో పాటు రెండు ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలియో రహిత సమాజం నిర్మాణానికి ఈ కార్యక్రమం ఎంతో కీలకమని, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్ రంజిత తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Reporter
Namitha News