Thursday, 30 July 2026 12:25:56 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

శ్రీ పార్వతి పరమేశ్వర శివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష

Date : 28 November 2025 08:00 PM Views : 214

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : శ్రీ పార్వతి పరమేశ్వర శివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష - ఘనంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు - ఆధ్యాత్మిక విలువల తోనే ప్రశాంతమైన జీవితం - భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు మదనపల్లి నవంబర్ 28, ( బి. శ్రీనివాసులు రెడ్డి తరణం విలేఖరి ) : మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి రోడ్డు నందు గల శ్రీ పార్వతి పరమేశ్వర శివాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అంద జేయగా, ఆలయ కమిటీ సభ్యులు దుశ్యా లువ, పూలమాలతో సన్మానించారు. ఆలయ స్థిర జీర్ణోధారణ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సహకారం మరువలేనిదని ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ దైవభక్తి, ఆధ్యాత్మిక విలువల తోనే మనిషి ప్రశాంతమైన జీవితం గడప గలడన్నారు. ఆలయాన్ని నూతనంగా సర్వాంగ సుందరంగా నిర్మించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రాచ్యత్య పొకడలతో సమాజం పెడత్రోవ పట్టకుండా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించి సన్మార్గంలో నడిపించడానికి ఆలయాలు దోహద పడతాయన్నారు. అలాగే తమ వంతు ఆలయ అభివృద్ధికి భవిష్యత్తు లోనూ సహాయ సహకారాలు అంది స్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: