నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 15 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వారు మదనపల్లె జామున్ ఫ్రూట్ (అల్లనేరేడు పండ్ల) కు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించినట్లు వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. యూనివర్సిటీలోని మిట్స్ ఇంటెలెక్టుల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ మద్దతుతో ఈ దరఖాస్తు పూర్తి చేయబడిందని ఆయన వెల్లడించారు. మదనపల్లె అల్లనేరేడు పండ్లకు గాఢ ఊదా రంగు, సమతుల్యమైన తీపి-పులుపు రుచి, అధిక పోషక విలువలు, ఔషధ గుణాలు మరియు ఎక్కువకాలం నిల్వ ఉండే లక్షణాలు ప్రత్యేక గుర్తింపునిస్తాయని, ఇవి మదనపల్లె ప్రాంతంలోని ప్రత్యేక వ్యవసాయ-వాతావరణ పరిస్థితులతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. అల్ల నేరేడు పోషకాల గని అని, ఆరోగ్యకరమైన కొవ్వుల సమ్మేళనం. ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్తో సహా యాంటీఆక్సిడెంట్లు మెండు. ఇంకా ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సీ, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బీ6, విటమిన్ ఏ, పుష్కలంగా లభిస్తాయి అని, నేరేడు పండు మాత్రమే కాదు, ఆకులు, గింజల్ని ఔషధాలుగా వాడతారు ఆయన అన్నారు. అల్ల నేరేడు బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు చక్కటి ఔషధంలా పని చేస్తుంది అని, ఈ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి అని అన్నారు. రకాల ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా అడ్డుకుంటాయి అని, అలాగే దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి అని అన్నారు. అంతే కాకుండా అల్లనేరేడులో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది అని, ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని, అధిక రక్తపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది అని అన్నారు. కాలుష్యంగా కారణంగా దెబ్బతిన్న శ్వాస నాళాలు, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. వీటిలో ఉండే జింక్, విటమిన్ సీ ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. అల్ల నేరేడులో ఉండే సైనైడిన్ వంటి సమ్మేళనాలు కొలన్ కేన్సర్ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి అని అన్నారు. చెన్నైలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ లోని ఐపిఆర్ కార్యాలయానికి జి ఐ దరఖాస్తును సమర్పించినట్లు తెలిపారు. ఈ దరఖాస్తు ద్వారా మదనపల్లె అల్లనేరేడు పండ్లను మదనపల్లె భౌగోళిక ప్రాంతానికి ప్రత్యేకంగా సంబంధించిన విలక్షణమైన వ్యవసాయ ఉత్పత్తిగా అధికారిక గుర్తింపు పొందేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జి ఐ రక్షణ ద్వారా ఉత్పత్తి పేరు దుర్వినియోగాన్ని నిరోధించడం, నిజమైన సాగుదారులకు మెరుగైన ధరలు లభించేలా చేయడం మరియు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మదనపల్లె అల్లనేరేడు పండ్ల విలువను పెంచడం సాధ్యమవుతుందని వివరించారు. ఈ రిజిస్ట్రేషన్కు సహకరించిన శ్రీ భూదేవి జామున్ (అల్లనేరేడు పండ్ల) సొసైటీ , మిట్స్-ఐపిఎఫ్సి మరియు మిట్స్ ఆర్ & డి సెల్ సభ్యుల కృషిని యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సుల్లేర్ ద్వారకనాథ్ అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, డీన్ - రీసెర్చ్ & ఇన్నోవేషన్-డాక్టర్ రవీంద్రనాథ్ చెరుకూరి, అసోసియేట్ డీన్ (ఆర్ &డి) డాక్టర్ పి. శివయ్య, అధ్యాపక సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News