నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 03 : తంబళ్లపల్లె మండలంలో సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ రెండవ తేదీకి ముగియడంతో పంచాయతీల అభివృద్ధికి మండలంలో 21 పంచాయతీలకు 9 మంది ప్రత్యేక అధికారులు నియమితులయ్యారు. తంబళ్లపల్లె, పరసతోపు, పంచాలమర్రి పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, కుక్కరాజు పల్లి, రెడ్డి కోట, రేణుమాకులపల్లి పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో ఎం వి ప్రసాద్, కోసువారిపల్లి, బాలిరెడ్డిగారిపల్లి పంచాయతీలకు తాసిల్దార్ సి.శ్రీనివాసులు, గంగిరెడ్డిపల్లి, దిగువపాలెం పంచాయతీలకు ఏవో జె.థామస్ రాజా, గోపిదిన్నె, జుంజురపెంట పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో సి. మారుతీ కుమార్, కన్నెమడుగు, మర్రిమాకులపల్లి ఎంఈఓ బి.త్యాగరాజు, ఎద్దులవారిపల్లి, ఎర్రసానిపల్లి పంచాయతీలకు ఎంఈఓ-2 నాగసుబ్బరాయుడు, కోటకొండ, ఎగువసుగాలితాండ పంచాయతీలకు ఏవో కె.రమణ కుమార్, కొటాల, ఆర్ఎన్ తాండ పంచాయతీలకు మండల పశువైద్యాధికారి ఆర్. విక్రమ్ రెడ్డి ప్రత్యేక అధికారులుగా కొనసాగునున్నారు
Reporter
Namitha News