నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 05 : మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం ఆచార్లపల్లి కి చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకులు రాటకొండ శ్రీనివాసులు నాయుడు అనారోగ్యం తో మృతిచేందడం తో ఆచార్ల పల్లె లోని వారి స్వగృహం నందు రాటకొండ శ్రీనివాసులు నాయుడు పారదివాదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. రాటకొండ కుటుంబ సభ్యులను పరామర్శించి, శ్రీనివాసులు నాయుడు దూరం అవడం తెలుగుదేశం పార్టీ కి తీరని లోటు అంటూ వారు పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ , తెలుగు యువత నాయకులు ఖాన్, బిజెపి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News