నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 26 : తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుభకార్యం లేదా ఆ శుభకార్యం ఏదైనా కులం, మతం, ప్రాంతం బేదం లేకుండా తనకు తెలిసిన వెంటనే స్పందించడం తనకు చేతనైన సాయం చేసి ఆదుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇందులో భాగంగా ఆదివారం నడిరోడ్డులో ప్రమాదం జరిగి ఓ వ్యక్తి గాయపడి బాధలో ఉన్న అతన్ని తన సొంత వాహనంలో హుటాహుటిన మదనపల్లి ఆస్పత్రికి తరలించి తన మానవత్వాన్ని మరో మారు చాటుకుని శభాష్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆదివారం కుప్పం నియోజకవర్గంలో ఓ వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో తంబళ్లపల్లెలోని తన స్వగృహానికి తన వాహనంలో బయలుదేరాడు. మదనపల్లి-తంబళ్లపల్లె ప్రధాన రహదారి జోగివానిబురుజు సమీపంలో వస్తుండగా అదే సమయంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగి ద్విచక్ర వాహనంలో వస్తున్న తంబళ్లపల్లెకు చెందిన మహబూబ్ పీర్ తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనం కోసం ఎదురుచూస్తున్న సంఘటన చూసి చెలించి పోయిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి హుటాహుటిన వాహనం ఆపి బాధితున్ని పరామర్శించి ధైర్యం చెప్పి తన వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సలు దగ్గరుండి చేయించాలని మండల వైకాపా అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, నాయకులను పురమాయించి ప్రమాద విషయం బాధితులు కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు.అనంతరం వేరే వాహనంలో ఎమ్మెల్యే తంబళ్లపల్లె స్వగృహానికి బయలుదేరారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రమాద స్థలంలో ఆయన పడిన ఆందోళన, చూపిన చొరవ చూసి స్థానిక ప్రజలు ఔరా మన ఎమ్మెల్యే మనసున్న మారాజని కొనియాడడం కొసమెరుపు
Reporter
Namitha News