నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి మదనపల్లె : అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఎంప్లాయిస్ యూనియన్ వన్ టు డిపోల గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా),వన్ డిపో మేనేజర్ రమణారెడ్డిలు పేర్కొన్నారు.మంగళవారం ఆర్టీసీ టూ డిపో ఆవరణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఆర్టీసీ కార్మికుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.ఇందులో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్,నాగూర్ వలిలు మాట్లాడుతూ చదువుకోవడానికి అవకాశాలు లేకున్నప్పటికీ చిన్నతనం నుండే పట్టుదలతో చదివి దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగారన్నారు.విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి తిరిగి భారతదేశానికి వచ్చిన అనంతరం తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ విశేష సేవలు అందించారని కొనియాడారు.అంటరానితనం,కుల వ్యవస్థను నిర్మూలించి సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు అన్నారు.ముసాయిదా కమిటీ చైర్మనుగా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించి భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించారన్నారు.ఆ మహనీయుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బిఎ నాయక్,సిఎ బాబు నరసింహులు,శివ,యం.కె.నాయక్,ఈశ్వరప్ప,సీతారామ్,హుస్సేన్,ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
Reporter
Namitha News