నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 06 : తంబళ్లపల్లె మండలం గోపి దీన్నే దళితవాడలో ఫ్రిడ్జ్ పేలి ఇరువురికి తీవ్ర గాయాలయిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దళితవాడలో అర్ధరాత్రి ఫ్రిడ్జ్ నుండి వాసన రావడంతో పవిత్ర ఫ్రిడ్జ్ డోర్ తెరవడంతో ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలి పవిత్ర తోబాటు సోదరుడు ప్రకాష్ తీవ్ర గాయాలకు లోనయ్యారు. వారిని కాపాడడానికి వెళ్లిన ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలు నిర్వహించి మెరుగైన చికిత్సల కోసం మదనపల్లి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో ఇరువురిని తిరుపతికి తరలించారు. గాయపడిన కుటుంబానికి స్థానిక వైకాపా నాయకుడు రియల్టర్ నల్లగుండ్ల మల్లికార్జున రెడ్డి ఆర్థిక సాయం అందించి వారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు
Reporter
Namitha News