నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 19 : తంబళ్లపల్లి మండలంలోని కోసువారిపల్లి కూటమి ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పనులలో శరవేగంగా పరుగులు పెడుతున్నట్లు మాజీ సర్పంచ్, టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బేరిపల్లి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కోసువారిపల్లి బస్టాండ్ లో జరుగుతున్న సిసి రోడ్డు నిర్మాణం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలోని టిడిపి నాయకులు, కార్యకర్తల సహకారంతో కోసువారిపల్లి బస్టాండ్ తో పాటు ప్రతి గ్రామానికి సిసి రోడ్లు నిర్మాణాలు, పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ, నాలుగు గ్రామాలకు తాగునీటి సమస్యలు పరిష్కారం చేపట్టినట్లు చెప్పారు. దశాబ్ద కాలంగా గ్రామస్తులకు స్మశాన వాటిక సమస్య పరిష్కారానికి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామని అదేవిధంగా కోసువారిపల్లె పంచాయతీలోని ఏ సమస్యనైనా ఎప్పటికప్పుడు పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు
Reporter
Namitha News