నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 13 : రామసముద్రం మండలంలోని కేసి పల్లె గ్రామానికి చెందిన టిడిపి యువనాయకులు ఎన్. గణేష్ బుధవారం మదనపల్లి వైసీపీ నియోజకవర్గ సమన్వయ కర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, మండల. వైసీపీ సీనియర్ నాయకులు సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. గణేష్ కు వైసీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గణేష్ మాట్లాడుతూ వైసీపీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడతానన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు కేశవ రెడ్డి, జడ్పీటీసీ రామచంద్రారెడ్డి, వైస్ ఎంపిపి రమణారెడ్డి, గెవన్న, దొడ్డి పల్లె ఆనంద,వైసీపీ మండల జనరల్ సెక్రటరీ కేసి పల్లె ఈశ్వర్ రెడ్డి, రెడ్డివీరేగౌడ్ సర్దార్ బాషా,తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News