నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవ రెడ్డి మదనపల్లి లోని దేవత నగర్ నాలుగో నెంబర్ రోడ్డు నందు గల చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా తమ సేవలో అందిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి గారు వృత్తిరీత్యా అనంతపురం జిల్లాకు బదిలీ చెందడం వలన..... చాలా రోజుల తర్వాత ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులను మరియు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారులను పలకరించుటకు తమ సమయం కేటాయించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి మునుపటిలాగే ప్రేమానురాగాలతో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులను పలకరించి వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చిన్నారులకు వివరించి ఆయనతోపాటు మరికొంత మంది పారామెడికల్ డిపార్ట్మెంట్ వారిని పరిచయం చేయడమే కాకుండా సంస్థకు ఎప్పటినుంచి సహకరిస్తున్నటువంటి మదనపల్లి ఫార్మా మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రెసిడెంట్ అంజద్ భాషా ని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థకు భవిష్యత్తులోఎలాంటి అవసరాలు ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి గారి బృందం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు తదుపరి పిల్లలకు ఇష్టమైన తినుబండారాలను అందించి వారితో మమేకమై మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ సెక్రెటరీ ఏ కవితా రాణి గారు మాట్లాడుతూ కేశవరెడ్డి సేవలు చిరస్మరణ ఎప్పుడు పిల్లలకు మరియు వృద్ధులకు ఇలాంటి ఇబ్బందులు కలిగిన వెనువెంటనే ఆరోగ్య అవసరమైన మందులను అందిస్తూ ఎంతో మందికి సంస్థ గురించి తెలియజేస్తున్న వారికి సమస్త ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతుంది. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో ఎం పి హెచ్ డబ్ల్యు మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మరియు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కేశవరెడ్డి బృందానికి సంస్థ జ్ఞాపిక అందించి కృతజ్ఞతలు తెలిపారు
Reporter
Namitha News