నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 17: గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. పి.టి.యం మండలం కాట్నగల్లు గ్రామ సచివాలయాన్ని శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిత తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ లో భాగంగా సచివాలయం లోని హాజరు పట్టిక, వి.ఆర్.ఓ కి సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. సచివాలయంలోని విఆర్ఓ, సర్వేయర్ లతో జిల్లా కలెక్టర్... గ్రామంలో రెవెన్యూ శాఖ కు సంబంధించిన సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. దారి సమస్యలు, రీ సర్వే, మ్యుటేషన్ లు, తదితర రెవెన్యూ శాఖ కు సంబంధించిన సమస్యలు అన్ని గ్రామ సచివాలయం లోనే పరిష్కారం అయ్యే దిశగా పని చేయాలని, ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రం మరియు జిల్లా అధికారుల చుట్టూ తిరగకుండా వారి సమస్యలు గ్రామ స్థాయి లోనే ప్రజా పరిష్కారాల వేదిక నందు వారి సమస్యలను పరిష్కరించాలని, జిల్లా సచివాలయం నుండి అందుతున్న అర్జీల పై వెంటనే స్పందించి బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా నిర్దేశించిన సమయంలోనే పరిష్కరించే దిశగా పని చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీ తో మాట్లాడుతూ.... గ్రామంలో ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోందా లేదా, మూడు నెలలకు ఒకసారి పంచాయతీ వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చెత్త సేకరించే సమయంలో ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చే విధంగా వారికి అవగాహన కల్పించి చెత్తను ప్రతి రోజు సేకరించాలని తద్వారా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పాటించాలని గ్రామానికి సరఫరా చేస్తున్న నీళ్ల ట్యాంకు ప్రతి మూడు నెలలకి ఒక సారి శుభ్రపరచి ప్రజలకు మంచి నీరు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల ద్వారా ఏర్పాటుచేసిన ప్రభుత్వ సేవలు అన్నిటిని ప్రజలకు సులభతరంగా అందజేయాలన్నారు. దీనితోపాటు రైతులకు తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యవసాయంనకు అవసరమైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించే విషయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ పాత్ర కీలకమన్నారు. సచివాలయ సిబ్బంది అందరూ ఉదయం మరియు సాయంత్రం ఫేస్ అటెండెన్స్ కచ్చితంగా వేయాలని ఆదేశించారు
Reporter
Namitha News