నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అట్టహాసంగా వైసీపీ నేత హరీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు - భారీగా తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు - ఘనసత్కారాలతో శుభాకాంక్షలు తెలిపిన శ్రేణులు మదనపల్లె : ఏపీఎండిసి మాజీ చైర్మన్,వైఎస్ఆర్సిపి యువనేత హరీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద మంగళవారం అట్టహాసంగా జరిగాయి.ఈ వేడుకలకు పీలేరు,మదనపల్లి నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో వైకాపా నాయకులు,కార్యకర్తలు హాజరయ్యారు.ఇందులో భాగంగా కేక్ కట్ చేసి శాలువాలు,పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు అనుగుణంగా ప్రజల శ్రేయస్సు కోసం హరీష్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు.పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారన్నారు.అంతేకాకుండా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.నాయకులు,కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారన్నారు.వైఎస్సార్సీపీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ,కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమంగా భావిస్తున్న హరీష్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,రాజకీయంగా ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.అనంతరం హరీష్ రెడ్డి మాట్లాడుతూ తనపై అంతులేని అభిమానం చూపిన పార్టీ నాయకులు,కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు.భవిష్యత్తులోను అందరి ఆదరాభిమానాలు తనపై ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితమవుతానని ఆయన స్పష్టం చేశారు.పార్టీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి,పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి,మదనపల్లి వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,వైకాపా యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఇతర పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.అనంత పార్టీ నాయకులు,కార్యకర్తలకు విందు భోజనం ఏర్పాటు చేశారు. - భారీగా తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు - ఘనసత్కారాలతో శుభాకాంక్షలు తెలిపిన శ్రేణులు మదనపల్లె : ఏపీఎండిసి మాజీ చైర్మన్,వైఎస్ఆర్సిపి యువనేత హరీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద మంగళవారం అట్టహాసంగా జరిగాయి.ఈ వేడుకలకు పీలేరు,మదనపల్లి నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో వైకాపా నాయకులు,కార్యకర్తలు హాజరయ్యారు.ఇందులో భాగంగా కేక్ కట్ చేసి శాలువాలు,పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు అనుగుణంగా ప్రజల శ్రేయస్సు కోసం హరీష్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు.పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారన్నారు.అంతేకాకుండా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.నాయకులు,కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారన్నారు.వైఎస్సార్సీపీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ,కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమంగా భావిస్తున్న హరీష్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,రాజకీయంగా ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.అనంతరం హరీష్ రెడ్డి మాట్లాడుతూ తనపై అంతులేని అభిమానం చూపిన పార్టీ నాయకులు,కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు.భవిష్యత్తులోను అందరి ఆదరాభిమానాలు తనపై ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితమవుతానని ఆయన స్పష్టం చేశారు.పార్టీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి,పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి,మదనపల్లి వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,వైకాపా యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఇతర పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.అనంత పార్టీ నాయకులు,కార్యకర్తలకు విందు భోజనం ఏర్పాటు చేశారు.
Reporter
Namitha News