నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 17 : మదనపల్లి లో బయటపడ్డ కిడ్నీ రాకెట్ ఉద్దాంతం దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటాదని వీటిపైన సిబిసిఐడి సిట్ ఏర్పాటు చేయాలని నేడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బృందం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి మెడికల్ మాఫియా వీధి వీధికి పుట్టగొడుగుల్లాగా పుట్టకొస్తున్న ప్రైవేట్ హాస్పటల్ దందా పై వైద్యఆరోగ్యశాఖ దర్యాప్తు చేయాలని కోరడం జరిగిందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే మురళీలు మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన మదనపల్లి ఎస్బిఐ కాలనీ లోని గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ ఉద్దాంతం వలన ఒక నిండు ప్రాణం బలి తీసుకోవడం జరిగిందని విశాఖపట్నం మధురవాడకు చెందిన యమునా 28 అనే మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపి మదనపల్లికి తీసుకొచ్చి గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ ఆపరేషన్ చేసి వైద్యం వికటించి మృతి చెందడం జరిగిందని ఈ కిడ్నీ రాకెట్ వెనక 15 మంది ముఠాలు ఉన్నారని వీరే కాక దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఈ కిడ్నీ రాకెట్ కొనసాగుతున్నదని ప్రైవేట్ హాస్పిటల్ లో ఇలాంటి సంఘటనలు యదేచ్చగా జరుగుతున్నాయని మదనపల్లి పి పి పీ అపోలో ఆధ్వర్యంలో కొనసాగుతున్న డయాలసిస్ సెంటర్లో ప్రస్తుతం డాక్టర్ గా కొనసాగుతున్న వ్యక్తి డయాలసిస్ మేనేజర్ బాల రంగడు చిత్తూరు డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఆంజనేయులు జిల్లాస్థాయిలో ఉన్నత పదవులు ఉంటూ అమాయక ప్రజల అవయవాలపై వ్యాపారం చేయడం దుర్మార్గమైన చర్య అని ఈ గ్లోబల్ హాస్పిటల్ ను పర్మినెంట్గా సీట్ చేయాలని కిడ్నీ రాకెట్ లో పాల్గొన్న వైద్యుల యొక్క వైద్య లైసెన్సును రద్దు చేయాలని నిర్పక్షపాతంగా నిజాన్ని నెగ్గు తేల్చాలంటే సి బి సి ఐ డి చేత సిట్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు మదనపల్లిలో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇస్తానుసారంగా ఓపీలు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తమ సొంతంగా నడిపిస్తున్న మెడికల్ స్టోర్ లో అధిక రేట్లకు మెడిసిన్స్ విక్రయిస్తున్నారని చిన్న సమస్యకు హాస్పిటల్స్ పోతే వివిధ రకాల టెస్టులు అనవసరంగా చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలు జోబిలకు సీన్లు పెడుతున్నారని రెసిడెన్స్ ఏరియాలో ప్రైవేట్ హాస్పిటల్స్ పరిమిషన్ ఇవ్వడాన్ని వారు తప్పుబట్టారు అసలు అంబులెన్స్లే పోనీ ప్రదేశాలలో ప్రైవేట్ హాస్పిటల్స్ కు పరిమిషన్ ఇచ్చి ఉన్నత అధికారులు ముడుపులు తీసుకుంటున్నారని వారు విమర్శించారు అసలు గ్లోబల్ హాస్పిటల్ లో ఎప్పటి నుంచి కిడ్నీ రాకెట్ జరుగుతున్నది ఎంతమంది దగ్గర కిడ్నీలు తొలగించారు ఎవరెవరికి అమర్చారు వాటికి సంబంధించి నిజా నిజాలు నెగ్గు తేల్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలే లక్ష్యంగా పట్టణ ప్రాంతాలలో మురికివాడల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కూలికిపోయినా పేద ప్రజలు లక్ష్యంగా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపి వారి కిడ్నీలను దొంగలించి కోట్ల రూపాయల ఘటిస్తూ అవయవాలను వ్యాపారం చేస్తున్న ఈ మానవ మృగాలపై కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గంగాధర్ హరి నర్సింహులు రవి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News