Thursday, 16 April 2026 08:30:58 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మదనపల్లి కిడ్నీ రాకెట్ ఉదతం ను సిట్/సిబిఐ విచారణ చేయాలని సిపిఐ డిమాండ్

మదనపల్లి కిడ్నీ రాకెట్ ఉదతం ను సిట్/సిబిఐ విచారణ చేయాలని సిపిఐ డిమాండ్

Date : 17 November 2025 08:19 PM Views : 119

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 17 : మదనపల్లి లో బయటపడ్డ కిడ్నీ రాకెట్ ఉద్దాంతం దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటాదని వీటిపైన సిబిసిఐడి సిట్ ఏర్పాటు చేయాలని నేడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బృందం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి మెడికల్ మాఫియా వీధి వీధికి పుట్టగొడుగుల్లాగా పుట్టకొస్తున్న ప్రైవేట్ హాస్పటల్ దందా పై వైద్యఆరోగ్యశాఖ దర్యాప్తు చేయాలని కోరడం జరిగిందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే మురళీలు మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన మదనపల్లి ఎస్బిఐ కాలనీ లోని గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ ఉద్దాంతం వలన ఒక నిండు ప్రాణం బలి తీసుకోవడం జరిగిందని విశాఖపట్నం మధురవాడకు చెందిన యమునా 28 అనే మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపి మదనపల్లికి తీసుకొచ్చి గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ ఆపరేషన్ చేసి వైద్యం వికటించి మృతి చెందడం జరిగిందని ఈ కిడ్నీ రాకెట్ వెనక 15 మంది ముఠాలు ఉన్నారని వీరే కాక దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఈ కిడ్నీ రాకెట్ కొనసాగుతున్నదని ప్రైవేట్ హాస్పిటల్ లో ఇలాంటి సంఘటనలు యదేచ్చగా జరుగుతున్నాయని మదనపల్లి పి పి ‌పీ అపోలో ఆధ్వర్యంలో కొనసాగుతున్న డయాలసిస్ సెంటర్లో ప్రస్తుతం డాక్టర్ గా కొనసాగుతున్న వ్యక్తి డయాలసిస్ మేనేజర్ బాల రంగడు చిత్తూరు డిఎం అండ్ హెచ్ ఓ‌ డాక్టర్ ఆంజనేయులు జిల్లాస్థాయిలో ఉన్నత పదవులు ఉంటూ అమాయక ప్రజల అవయవాలపై వ్యాపారం చేయడం దుర్మార్గమైన చర్య అని ఈ గ్లోబల్ హాస్పిటల్ ను పర్మినెంట్గా సీట్ చేయాలని కిడ్నీ రాకెట్ లో పాల్గొన్న వైద్యుల యొక్క వైద్య లైసెన్సును రద్దు చేయాలని నిర్పక్షపాతంగా నిజాన్ని నెగ్గు తేల్చాలంటే సి బి సి ఐ డి చేత సిట్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు మదనపల్లిలో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇస్తానుసారంగా ఓపీలు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తమ సొంతంగా నడిపిస్తున్న మెడికల్ స్టోర్ లో అధిక రేట్లకు మెడిసిన్స్ విక్రయిస్తున్నారని చిన్న సమస్యకు హాస్పిటల్స్ పోతే వివిధ రకాల టెస్టులు అనవసరంగా చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలు జోబిలకు సీన్లు పెడుతున్నారని రెసిడెన్స్ ఏరియాలో ప్రైవేట్ హాస్పిటల్స్ పరిమిషన్ ఇవ్వడాన్ని వారు తప్పుబట్టారు అసలు అంబులెన్స్లే పోనీ ప్రదేశాలలో ప్రైవేట్ హాస్పిటల్స్ కు పరిమిషన్ ఇచ్చి ఉన్నత అధికారులు ముడుపులు తీసుకుంటున్నారని వారు విమర్శించారు అసలు గ్లోబల్ హాస్పిటల్ లో ఎప్పటి నుంచి కిడ్నీ రాకెట్ జరుగుతున్నది ఎంతమంది దగ్గర కిడ్నీలు తొలగించారు ఎవరెవరికి అమర్చారు వాటికి సంబంధించి నిజా నిజాలు నెగ్గు తేల్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలే లక్ష్యంగా పట్టణ ప్రాంతాలలో మురికివాడల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కూలికిపోయినా పేద ప్రజలు లక్ష్యంగా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపి వారి కిడ్నీలను దొంగలించి కోట్ల రూపాయల ఘటిస్తూ అవయవాలను వ్యాపారం చేస్తున్న ఈ మానవ మృగాలపై కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గంగాధర్ హరి నర్సింహులు రవి తదితరులు పాల్గొన్నారు

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :