నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టొమాటో మార్కెట్ యార్డ్లో పల్స్ పోలియో కార్యక్రమం చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఏఎంసీ చైర్మన్ శివరాం జంగాల మదనపల్లి: మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం జంగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీరుగొట్టిపల్లి గ్రామానికి చెందిన చిన్నారులతో పాటు మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఏ చిన్నారినీ ఈ అవకాశానికి దూరం చేయకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ సిబ్బంది, మార్కెట్ యార్డ్ అధికారులు, కార్మికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News