నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 18 : ఎన్నికల ఓటర్లు నమోదు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ సర్వే పారదర్శకంగా త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవ కృష్ణారెడ్డి బిఎల్ఓ లకు సూచించారు. గురువారం ఆయన తంబళ్లపల్లె లో ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొని ఓటర్ నమోదు కార్యక్రమం పై బిఎల్ఓ లకు పలు సలహాలు సూచనలు చేశారు. ఎన్ను మరేటర్లు చేసిన సర్వే పై బిఎల్వోలు సమగ్ర విచారణ చేపట్టి గత ఎన్నికల జాబితాను సక్రమంగా సరిచూడాలన్నారు. ఎన్నుమలేటర్లు ఫారాలు పూర్తిచేసి ఓటర్ల నుండి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, విద్యార్థులైతే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ జిరాక్స్ సేకరించాలన్నారు. ఓటర్ జాబితా లో అవకతవకులు లేకుండా గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టి సమగ్ర ఓటర్ జాబితా తయారు చేయడానికి సహకరించాలని సూచించారు. ఆయన వెంట తాసిల్దార్ శ్రీనివాసులు, బిఎల్వోలు నాగరాజు, సురేష్, ఎన్నుమర్యేటర్లు, ఓటర్లు పాల్గొన్నారు
Reporter
Namitha News