Thursday, 30 July 2026 06:27:34 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మోకాలి జబ్బులను తక్షణమే గుర్తించే స్మార్ట్ ఆధార పరికరాన్ని అభివృద్ధి చేసిన మిట్స్ విద్యార్థులు

Date : 09 June 2026 09:05 PM Views : 99

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 09 : మదనపల్లి పట్టణం సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) నాలుగో సంవత్సరం విద్యార్థులు వినూత్న ఆలోచనతో “స్మార్ట్ నీ బ్రేస్ ఫర్ ఇన్‌స్టంట్ ఇంజరీ డిటెక్షన్” అనే ఆధునిక ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. విద్యార్థులు సి. నందిని, కె. నందిని మరియు కె. నందిని లు ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్, పర్యవేక్షణలో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఆధారిత ధరించగలిగే స్మార్ట్ పరికరాన్ని రూపొందించారు. మోకాలి గాయాలను ప్రారంభ దశలోనే గుర్తించి, వాటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ స్మార్ట్ బ్రేస్‌ అధునాతన పరికరం లో అమర్చిన మాయిశ్చర్ సెన్సర్ ద్వారా మోకాలిలో ఏర్పడే వాపు మరియు మోకాలి గుజ్జు పేరుకుపోయిన పరిస్థితులను గుర్తించవచ్చు. అలాగే జైరోస్కోప్ సెన్సర్ ను మోకాలి కదలికలను విశ్లేషించి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగించమని వారు అన్నారు. ఈ వివరాలను ఆర్డినో మైక్రోకంట్రోలర్ విశ్లేషించి ఏవైనా అసాధారణ మార్పులు గుర్తించిన వెంటనే బజర్ ద్వారా హెచ్చరికను అందించడంతో పాటు ఎల్‌సీడీ డిస్‌ప్లేపై సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా నోడ్‌ఎంసీయూ వై-ఫై మాడ్యూల్ సహాయంతో సేకరించిన సమాచారాన్ని క్లౌడ్‌కు పంపించి, మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు మరియు వారి సంరక్షకులకు తక్షణ సమాచారం చేరే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారని విద్యార్థులు తెలిపారు. మోకాలి గాయాలను ముందుగానే గుర్తించి తక్షణ వైద్య సహాయం పొందేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా క్రీడాకారులు, వృద్ధులు మరియు పునరావాస చికిత్స పొందుతున్న రోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్థాయి ఆరోగ్య సంరక్షణ పరిష్కారంగా తీర్చిదిద్దనున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల వినూత్న ఆలోచనను అభినందించిన ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ గౌరె, ఇటువంటి పరిశోధనాత్మక ప్రాజెక్టులు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :