Tuesday, 15 September 2026 06:48:55 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు

Date : 05 June 2026 02:44 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు : మదనపల్లి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయనే నిబంధన పేరుతో పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడం అత్యంత అన్యాయమని, తొలగించిన కార్మికులను వెంటనే యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఆసుపత్రి ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఆసుపత్రిలో పారిశుద్ధ్య సేవలు అందిస్తూ రోగులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను ఒక్కసారిగా విధుల నుంచి తొలగించడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఉపాధి అవకాశాల కొరత నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సేవలందించిన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు. 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయనే కారణంతో విధుల నుంచి తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకుని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో కార్మికులపై ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉద్యోగ భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో కార్మికులతో కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు గజపతి, పారిశుద్ధ్య కార్మికులు లక్ష్మి పార్వతి, లలిత, రాజేశ్వరి, గుంటమ్మ, కృష్ణవేణి, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :