నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రైతులకు నాణ్యమైన ఎరువులు,మేలిరకం విత్తనాలు అందించాలి - తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు సూచనలు - అట్టహాసంగా పద్మ ట్రేడర్స్ ప్రారంభోత్సవం మదనపల్లె : నియోజకవర్గంలోని రైతులకు నాణ్యమైన వ్యవసాయ మందులు,విత్తనాలు అందించి పంటల దిగుబడి పెరగడానికి వ్యాపారులు సహకరించాలని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు సూచించారు.సోమవారం మదనపల్లె పట్టణంలోని ఎస్.బి.ఐ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పద్మ ట్రేడర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముందుగా పద్మ ట్రేడర్స్ నిర్వహకులు నాగేశ్వరరావు,ప్రభు కుమార్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడికి ఘనస్వాగతం పలికారు.ఇందులో భాగంగా శ్రీరామ్ చినబాబు మరియు యాలగిరి దొరస్వామి నాయుడు షాప్ను ప్రారంభించి,నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విత్తనాలు,ఎరువులు,వ్యవసాయ మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు.రైతన్నకు నష్టం కలిగించే నకిలీ,నాసిరకం మందులకు దూరంగా ఉండాలని,రైతుల నమ్మకాన్ని కాపాడే విధంగా వ్యాపారం నిర్వహించి అందరి మన్ననలు అందుకోవాలన్నారు.అనంతరం పద్మ ట్రేడర్స్ నిర్వాహకులు నాగేశ్వరావు,ప్రభుకుమార్ మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రసిద్ధిగాంచిన కంపెనీలకు చెందిన పురుగుమందులు,ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.రైతులకు నాణ్యమైన ఎరువులు,విత్తనాలు అందజేస్తామని తద్వారా అధిక దిగుబడులు సాధించి,ఎక్కువ లాభాలు గడించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు,కార్యకర్తలు,వ్యాపార ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News