నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 22 : తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రమైన తంబళ్లపల్లె తాహాసిల్దార్ కార్యాలయం శిధిలావస్థకు చేరుకుంది. కార్యాలయం వర్షాలకు పూర్తిగా దెబ్బతిని పై కప్పు ఊడి నివాసయోగ్యంగా లేకపోవడంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏడాది క్రితం సుమారు కిలోమీటర్ దూరంలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కు మార్చారు. రెవెన్యూ అధికారులకు సౌకర్యవంతంగా ఉండగా రైతులు, విద్యార్థులు, ప్రజలు కార్యాలయానికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ దుస్థితిపై పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి తాహాసిల్దార్ కార్యాలయ నిర్మాణం చేపట్టకపోతే ప్రజల నుండి విమర్శలు ఎదుర్కోక తప్పదు
Reporter
Namitha News