Thursday, 30 July 2026 11:32:38 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సుస్థిర ఆవిష్కరణ & సహకార డెవోప్స్ పై అతిధి ఉపన్యాసం

న్యూ ఢిల్లీ లోని ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజినీర్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో అతిధి ఉపన్యాసం

Date : 15 November 2025 08:07 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 15 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగము వారు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో సుస్థిర ఆవిష్కరణ మరియు సహకార దేవోప్స్ సంస్కృతి మరియు పద్ధతులు అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సత్య పళనిసామి, ఐ.టి కన్సల్టెంట్, NTT డేటా పేమెంట్ సర్వీసెస్, బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో సత్య పళనిసామి మాట్లాడుతూ డేవ్ ఆప్స్ అనేది సాఫ్ట్‌వేర్ అభివృద్ధి మరియు ఐటి ఆపరేషన్ల సమన్వయాన్ని పెంచేందుకు, ఉత్పాదకతను మెరుగుపరచడానికి మరియు వేగంగా గుణాత్మకమైన సేవలను అందించడానికి ఉపయోగించే సాంకేతిక నిర్మాణ మార్పు అని అన్నారు. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో డెవ్‌ఆప్స్ పద్ధతులు సంస్థల ఎదుగుదలకు, మార్పులకు అనుగుణంగా మారడం చాలా అవసరమని అన్నారు. బృందాల మధ్య సహకారాన్ని పెంపొందించి , ప్రక్రియలను క్రమబద్దీకరిస్తూ సుస్థిరమైన ఆవిష్కరణలకు దారితీస్తాయని అన్నారు. డెవ్‌ఆప్స్ టూల్స్, టెక్ దిగ్గజాల నుండి చిన్న స్టార్టప్‌ల వరకు, పోటీతత్వాన్ని పొందేందుకు డేవ్ ఆప్స్ ను స్వీకరించాయి అని, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ మరియు పేస్ బుక్ వంటి ప్రముఖ సంస్థలు తమ సాఫ్ట్‌వేర్ డెలివరీ పైప్‌లైన్‌లను డేవ్ ఆప్స్ ప్రాక్టీస్‌ల చుట్టూ నిర్మించాయి అన్నారు. CI/CD పైప్‌లైన్‌ల అమలు, మరియు బలమైన డెవ్‌ఆప్స్ సంస్కృతిని నిర్మించడం వంటి అంశాలు విద్యార్థులకు పరిశ్రమల యొక్క తాజా పోకడలు, సాంకేతికతలపై అవగాహన కల్పిస్తాయని, వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్.కుసుమ, కోఆర్డినేటర్స్ కె.పుగజరాసి, డాక్టర్ కె.నిర్మల దేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :