నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 15 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగము వారు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో సుస్థిర ఆవిష్కరణ మరియు సహకార దేవోప్స్ సంస్కృతి మరియు పద్ధతులు అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సత్య పళనిసామి, ఐ.టి కన్సల్టెంట్, NTT డేటా పేమెంట్ సర్వీసెస్, బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో సత్య పళనిసామి మాట్లాడుతూ డేవ్ ఆప్స్ అనేది సాఫ్ట్వేర్ అభివృద్ధి మరియు ఐటి ఆపరేషన్ల సమన్వయాన్ని పెంచేందుకు, ఉత్పాదకతను మెరుగుపరచడానికి మరియు వేగంగా గుణాత్మకమైన సేవలను అందించడానికి ఉపయోగించే సాంకేతిక నిర్మాణ మార్పు అని అన్నారు. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో డెవ్ఆప్స్ పద్ధతులు సంస్థల ఎదుగుదలకు, మార్పులకు అనుగుణంగా మారడం చాలా అవసరమని అన్నారు. బృందాల మధ్య సహకారాన్ని పెంపొందించి , ప్రక్రియలను క్రమబద్దీకరిస్తూ సుస్థిరమైన ఆవిష్కరణలకు దారితీస్తాయని అన్నారు. డెవ్ఆప్స్ టూల్స్, టెక్ దిగ్గజాల నుండి చిన్న స్టార్టప్ల వరకు, పోటీతత్వాన్ని పొందేందుకు డేవ్ ఆప్స్ ను స్వీకరించాయి అని, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ మరియు పేస్ బుక్ వంటి ప్రముఖ సంస్థలు తమ సాఫ్ట్వేర్ డెలివరీ పైప్లైన్లను డేవ్ ఆప్స్ ప్రాక్టీస్ల చుట్టూ నిర్మించాయి అన్నారు. CI/CD పైప్లైన్ల అమలు, మరియు బలమైన డెవ్ఆప్స్ సంస్కృతిని నిర్మించడం వంటి అంశాలు విద్యార్థులకు పరిశ్రమల యొక్క తాజా పోకడలు, సాంకేతికతలపై అవగాహన కల్పిస్తాయని, వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్.కుసుమ, కోఆర్డినేటర్స్ కె.పుగజరాసి, డాక్టర్ కె.నిర్మల దేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News