Thursday, 30 July 2026 06:48:55 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు

సిపియం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

Date : 14 April 2026 03:43 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత, నవభారత నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశించిన కుల నిర్మూలన జరిగినప్పుడే దేశంలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన దళితులపై సామాజిక వివక్ష తొలగిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులను దళితేతర క్రైస్తవులు వివాహం చేసుకోకపోవడమే దీనికి నిదర్శనమని, క్రైస్తవంలోనూ కుల వ్యవస్థ వేళ్లూనుకొని ఉందని విమర్శించారు. సిక్కు, బౌద్ధ మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పిస్తున్నట్లే, దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజికంగా వారు ఎదుర్కొంటున్న దాడులు, వివక్ష కులం ఆధారంగానే జరుగుతున్నాయని గుర్తు చేశారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్లు దళిత క్రైస్తవుల స్థితిగతులను అధ్యయనం చేసి వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసినా, పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిషన్ నివేదిక వచ్చే వరకు వేచి చూడకుండా అత్యున్నత న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటు చర్యే అవుతుందని అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాల విముక్తి కోసం వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. కుల వివక్షకు వ్యతిరేకంగా చేసే పోరాటాన్ని వర్గ పోరాటంలో' అంతర్భాగం చేయడం ద్వారానే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించగలమని ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం, కుల దురహంకార దాడులకు వ్యతిరేకంగా సిపిఎం నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, రామకృష్ణ, గోపాల్, రాజు, శంకరమ్మ, జయమ్మ, రెడ్డెమ్మ, శ్రీరాములు, రామచంద్ర, కృష్ణప్ప, రమణమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :