నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 15 : రామసముద్రం మండల కేంద్రలో శనివారం స్వచ్ ఆంధ్ర స్వచ్ దివస్ కార్యక్రమాన్ని ఎంపిడివో లతీఫ్ ఖాన్ రామసముద్రం జడ్పీ హైస్కూల్ హెచ్.ఎం చిట్టిబాబు,జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ చిట్టిబాబు, పంచాయతీ కార్యదర్శి మునిస్వామి నాయక్, ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,జడ్పీ హైస్కూల్ విద్యార్థులు హెచ్ ఎం చిట్టిబాబు ఆధ్వర్యంలో స్వర్ణాంద్ర ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పడి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. వీరు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లతీఫ్ ఖాన్ ఎం ఈ ఓ 2ఆంజనేయులు, ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ చిట్టిబాబు,హెచ్ ఎం చిట్టిబాబు, పంచాయతీ కార్యదర్శి మునిస్వామినాయక్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News